రేపు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన
ABN , First Publish Date - 2022-04-12T00:25:02+05:30 IST
మంగళవారం అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు రేపు అనంతపురం నుండి
అమరావతి: మంగళవారం అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు రేపు అనంతపురం నుండి పవన్ కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అనంతరం రైతుల కుటుంబాలతో మాట్లాడుతారని జనసేన నేతలు తెలిపారు. గ్రామ సభ అనంతరం పవన్ హైదరాబాద్ వెళ్లనున్నారు.