నష్టపోవడానికి పవన్‌ ప్రొడ్యూసరా, డిస్ర్టిబ్యూటరా?: రోజా

ABN , First Publish Date - 2022-02-28T01:49:32+05:30 IST

సినిమాతో నష్టపోవడానికి నటుడు పవన్‌కల్యాణ్‌ ఏమైనా ప్రొడ్యూసరా, డిస్ట్రిబ్యూటరా అంటూ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

నష్టపోవడానికి పవన్‌ ప్రొడ్యూసరా, డిస్ర్టిబ్యూటరా?: రోజా

తిరుమల: సినిమాతో నష్టపోవడానికి నటుడు పవన్‌కల్యాణ్‌ ఏమైనా ప్రొడ్యూసరా, డిస్ట్రిబ్యూటరా అంటూ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ను తొక్కేయడం కోసమే ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గించిందని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కూడా సీఎం జగన్మోహన్‌రెడ్డి మంచి చేశారనే విషయం మర్చిపోతున్నారన్నారు. తెలంగాణలో ‘భీమ్లా నాయక్‌’ టికెట్‌ ధర రూ.350 ఉంటే ఏపీలో రూ.150 మాత్రమే ఉందన్నారు. పుష్ప, అఖండ చిత్రాలకు ఉన్న రేట్లే భీమ్లా నాయక్‌ చిత్రానికీ ఉన్నాయని తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై 21వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి వల్ల సాధ్యంకాలేదన్నారు. సినిమాను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్‌ తన పార్టీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించడం కరెక్ట్‌ కాదని రోజు తప్పుబట్టారు.

Updated Date - 2022-02-28T01:49:32+05:30 IST