వెలుగు కావాలంటే పవన్ రావాలి: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2022-03-15T01:03:09+05:30 IST
రాష్ట్రంలో వెలుగు కావాలంటే అధికారంలోకి పవన్ రావాలని జనసేన
గుంటూరు: రాష్ట్రంలో వెలుగు కావాలంటే అధికారంలోకి పవన్ రావాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలోని ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ అంధకారంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. నిజాయితీగా పనిచేస్తే ప్రజలు మరచిపోరన్నారు. వైసీపే నేతలు దోపిడీలు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో జనసేనకు రైతులకు అండగా ఉన్నారన్నారు.