బీజేపీ డెకాయిట్లతో పవన్ మిలాఖత్: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2021-03-03T00:42:09+05:30 IST
మోసాలు చేసే బీజేపీ డెకాయిట్లతో జనసేన
అమరావతి: మోసాలు చేసే బీజేపీ డెకాయిట్లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోయారని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు ఒక్క ఓటు వేసినా వృథాయేనని నారాయణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన వారితో బీజేపీ నాయకులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని నారాయణ ఆరోపించారు. మురళీధర్రావు 3 కోట్లు ఇస్తానని మహిళను మోసం చేశారని ఆయన విమర్శించారు. విష్ణువర్ధన్రెడ్డి రూ.30 కోట్ల బ్లాక్ మెయిల్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.
అలాగే వైసీపీ ప్రభుత్వం పైనా ఆయన విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసమే రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాలు కొన్నారని ఆయన ఆరోపించారు. 196, 197 జీవోలు బొత్స సత్యనారాయణ ఇవ్వలేదని తాను దుర్గగుడిలో ప్రమాణం చేయాలని బొత్సకు నారాయణ సవాల్ విసిరారు.