కాంగ్రెస్ తాత్కాలిక కోశాధికారిగా పవన్ కుమార్
ABN , First Publish Date - 2020-11-29T07:35:55+05:30 IST
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా ఆ పార్టీ సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ నియమితులయ్యారు. కోశాధికారిగా వ్యవహరించిన సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం నేపథ్యంలో బన్సల్ను తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారని...
న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా ఆ పార్టీ సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ నియమితులయ్యారు. కోశాధికారిగా వ్యవహరించిన సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం నేపథ్యంలో బన్సల్ను తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన బన్సల్ ప్రస్తుతం ఏఐసీసీ పాలకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. త్వరలోనే ఆయన అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.