వ్యవసాయ క్షేత్రంలో పవన్ కనుమ వేడుకలు

ABN , First Publish Date - 2021-01-16T01:19:31+05:30 IST

గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగమేనని జనసేన అధినేత ..

వ్యవసాయ క్షేత్రంలో పవన్  కనుమ వేడుకలు

అమరావతి:  గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగమేనని జనసేన అధినేత  పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  శుక్రవారం  హైదరాబాద్‌లోని గోశాలలో కనుమ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు ఏర్పాట్లపై  సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు సుభీక్షంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాక్షించారు

Updated Date - 2021-01-16T01:19:31+05:30 IST