వ్యవసాయ క్షేత్రంలో పవన్ కనుమ వేడుకలు
ABN , First Publish Date - 2021-01-16T01:19:31+05:30 IST
గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగమేనని జనసేన అధినేత ..
అమరావతి: గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని గోశాలలో కనుమ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు సుభీక్షంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాక్షించారు