జగన్ నిర్ణయం ఆ కుటుంబానికి ఊరటనిస్తుంది: పవన్
ABN , First Publish Date - 2020-02-19T18:44:19+05:30 IST
కర్నూలు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇవ్వాలన్న నిర్ణయం మంచిదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఊరటనిచ్చే విషయమన్నారు.
కర్నూలు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇవ్వాలన్న నిర్ణయం మంచిదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఊరటనిచ్చే విషయమన్నారు. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యమైందన్నారు. సీబీఐ విచారణను వేగవంతం చేయాలని పవన్ కోరారు.
కాగా.. పవన్ రేపు ఢిల్లీకి పయనమవనున్నారు. ఢిల్లీలో కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మాజీ సైనిక సంక్షేమ నిధికి ఆయన రూ.కోటి విరాళం ఇవ్వనున్నారు. అనంతరం విజ్ఞాన్భవన్లో జరిగే యూత్ పార్లమెంట్లో పవన్ పాల్గొననున్నారు.