రేణిగుంట చేరుకున్న పవన్కల్యాణ్.. తిరుపతికి పయనం
ABN , First Publish Date - 2021-01-21T21:32:20+05:30 IST
జనసేన అధినేత పవన్కల్యాణ్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి
తిరుపతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి ప్రయాణం అయ్యారు. కాసేపట్లో తిరుపతిలో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఈ రాత్రికి తిరుమల లోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు తిరుపతిలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.