ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ సంఘీభావ దీక్ష

ABN , First Publish Date - 2021-12-12T15:43:53+05:30 IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు.

ఉక్కు ఫ్యాక్టరీ  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ సంఘీభావ దీక్ష

అమరావతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు.  మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. వేదికపై పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అభిమానులు, కార్యకర్తలు సందర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు పవన్ దీక్షకు మద్దతు తెలపనున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 

Updated Date - 2021-12-12T15:43:53+05:30 IST