టీడీపీ కార్యాలయాలపై ఒకేసారి దాడి ఉద్దేశపూర్వకం: పవన్

ABN , First Publish Date - 2021-10-20T02:13:31+05:30 IST

టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ..

టీడీపీ కార్యాలయాలపై ఒకేసారి దాడి ఉద్దేశపూర్వకం: పవన్

అమరావతి: టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని తెలిపారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు. కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారని చెబుతున్నారని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు. 


Updated Date - 2021-10-20T02:13:31+05:30 IST