పవన్‌కల్యాణ్‌ సీఎం కావాలని తిరుపతమ్మకు మొక్కులు

ABN , First Publish Date - 2022-08-15T06:25:32+05:30 IST

పవన్‌కల్యాణ్‌ సీఎం కావాలని తిరుపతమ్మకు మొక్కులు

పవన్‌కల్యాణ్‌ సీఎం కావాలని తిరుపతమ్మకు మొక్కులు
తిరుపతమ్మ ఆలయానికి పాదయాత్రగా వచ్చిన జనసేన నాయకులు

పెనుగంచిప్రోలు, ఆగస్టు 14: వచ్చే ఎన్నికల్లో జన సేన అధినేత పవన్‌కల్యాణ్‌ సీఎం కావాలని కోరుతూ నం దిగామ నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం అడవిరావులపాడు నుంచి పాదయాత్రగా వచ్చి తిరుపతమ్మను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. పార్టీ నందిగామ మండల అధ్యక్షుడు కుడుపుగంటి రామా రావు అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కుబడులు చెల్లించారు. తాటి వెంకటకృష్ణ, తాటి శివకృష్ణ, కమిశెట్టి వెంకటేశ్వరరావు, తోటకూర పద్మావతి, మేకపోతుల శ్రీలక్ష్మి యాదవ్‌, గొట్టెముక్కల వెంకటేశ్వర్లు, బేతపూడి జయరాజ్‌ చలమల సౌందర్య, చారి పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-15T06:25:32+05:30 IST