జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-03-26T21:16:28+05:30 IST

రాష్ట్ర సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్న వారి గురించి తక్షణమే స్పందించాలని సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఎన్‌వోసీలతో బయలుదేరిన

జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి

అమరావతి: రాష్ట్ర సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్న వారి గురించి తక్షణమే స్పందించాలని సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఎన్‌వోసీలతో బయలుదేరిన వారిని ఏపీ సరిహద్దుల్లో ఆపేశారన్నారు. యువతీ, యువకుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చాలని ఆయన కోరారు. పరీక్షలు చేసి హోంక్వారంటైన్‌లో ఉండమని సూచించాలని, అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే సమస్యలు వస్తాయని తెలిపారు. ఇళ్లకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్తే రోడ్డు మీదకు జనం రావడం తగ్గుతుందని పవన్‌ సూచించారు.

Updated Date - 2020-03-26T21:16:28+05:30 IST