వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-08-07T00:38:20+05:30 IST

వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

అమరావతి: వరద బాధితుల సమస్యలపై ధైర్యంగా నిలబడిన వీర మహిళలను జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రభుత్వ దాష్టీకాల మీద ధైర్యంగా మహిళలు ముందుండి పోరాడాలని పవన్ సూచించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా?, వరద బాధితులను ఆదుకోవాలని కోరితే మహిళలను బూతులు తిడతారా? అని ఆయన ప్రశ్నించారు. జనసేన వీర మహిళలకు జరిగిన అవమానంపై జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వీర మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వస్తుంటే, ముందుగా అక్కడున్న నాయకుల్ని గృహ నిర్భందాలు చేస్తున్నారని ఆరోపించారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వమని తాము కోరుతుంటే మీకు ఉలుకెందుకు..? అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతున్న వారిని ఇష్టానుసారం బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-08-07T00:38:20+05:30 IST