భద్రత పేరుతో బెదిరిస్తారా?: పవన్
ABN , First Publish Date - 2021-07-07T20:25:06+05:30 IST
భద్రత పేరుతో బెదిరిస్తారా?: పవన్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాడేపల్లి కరకట్ట వాసులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ చేయిస్తారా?, ఆడపడుచులను పచ్చి బూతులు తిడతారా? అని ప్రశ్నించారు. సీఎం ఇంటిచుట్టూ ఉన్నవారికే రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరని చెప్పారు. ఖాళీ చేయించడం తప్పని సరైతే...వారికి ముందు న్యాయం చేయాలని సూచించారు. 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే వారిని తరలించాలన్నారు. మొండిగా ముందుకెళ్తే జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరించారు.