1209 సర్పంచ్, 4456 వార్డులు గెలిచాం: పవన్
ABN , First Publish Date - 2021-02-28T08:31:59+05:30 IST
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ , 1776 ఉప సర్పంచ్ , 4456 వార్డుల్లో జనసేన భావజాలం
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ , 1776 ఉప సర్పంచ్ , 4456 వార్డుల్లో జనసేన భావజాలం, మద్దతు కలిగినవారు గెలుపొందడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతంపంచాయతీల్లో ద్వితీయస్థానంలో నిలిచామన్నారు. మొత్తం మీద 27 శాతం ఓటింగ్ను జనసేన పొందిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 36, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్లను జనసేన కైవసం చేసుకుందన్నారు. ఈ విజయం చాలా తృప్తినిచ్చిందన్నారు. దాడులు జరుగుతున్నా, అధికార పక్షం వాళ్లు తలలు పగలగొట్టినా... రక్తసిక్తం చేసినా, కుట్లు వేయించుకొని మరి ఎన్నికల్లో జనసైనికులు ధైర్యంగా నిలబడ్డారన్నారు. దానికి దమ్మాలపాడు గ్రామమే నిదర్శనమని పేర్కొన్నారు.