రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-05-23T05:02:24+05:30 IST
జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు ఆదివారం కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు.
అగనంపూడి, మే 22: జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు ఆదివారం కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులకు రూ.19 లక్షలు వ్యయం కానుందని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇల్లపు ప్రసాద్, నక్కా రమణబాబు, ఎలమంచిలి చినఅప్పారావు, ఎల్వీ రమణ, బలిరెడ్డి శ్రీను, కొండలరావు, రామకృష్ణ, రమణమ్మ, వరహాలు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.