రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-05-23T05:02:24+05:30 IST

జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్‌ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు ఆదివారం కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు.

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి

అగనంపూడి, మే 22: జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్‌ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు   ఆదివారం కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులకు రూ.19 లక్షలు వ్యయం కానుందని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇల్లపు ప్రసాద్‌, నక్కా రమణబాబు, ఎలమంచిలి చినఅప్పారావు,  ఎల్‌వీ రమణ, బలిరెడ్డి శ్రీను, కొండలరావు, రామకృష్ణ, రమణమ్మ, వరహాలు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T05:02:24+05:30 IST