నేడు ఢిల్లీకి పవన్‌.. సైనిక్‌ బోర్డుకు కోటి విరాళం

ABN , First Publish Date - 2020-02-20T10:29:46+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, కోటి రూపాయల విరాళాన్ని...

నేడు ఢిల్లీకి పవన్‌.. సైనిక్‌ బోర్డుకు కోటి విరాళం

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, కోటి రూపాయల విరాళాన్ని అందిస్తారు. అనంతరం విజ్ఞాన భవన్‌లో జరిగే ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉపన్యసిస్తారు. కాగా, సుగాలీ ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పవన్‌ అన్నారు. సీఎం జగన్‌ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలీ ప్రీతి కుటుంబానికి ఊరట కలిగిస్తుందన్నారు. 

Updated Date - 2020-02-20T10:29:46+05:30 IST