రేపు పర్చూరులో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
ABN , First Publish Date - 2022-06-19T02:02:20+05:30 IST
బాపట్ల: పవన్ కళ్యాణ్ రేపు బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80
బాపట్ల: పవన్ కళ్యాణ్ రేపు బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. చిలకలూరిపేట, జాగర్లమూడి, యద్దనపూడి మీదుగా పవన్ పర్చూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.