YCP సర్కార్ AP జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేస్తోంది: Pattabhiram

ABN , First Publish Date - 2022-06-12T21:06:36+05:30 IST

AP జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేందుకు YCP సర్కార్ శ్రీకారం చుట్టిందని పట్టాభిరామ్‌ విమర్శించారు.

YCP సర్కార్ AP జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేస్తోంది: Pattabhiram

Vijayawada: AP జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేందుకు YCP సర్కార్ శ్రీకారం చుట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ (Pattabhiram) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ థర్మల్ ప్రాజక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసి నష్టాల ఊబిలోకి నెడుతోందని ఆరోపించారు. ఏప్రిల్‌లో 382 మిలియన్ యూనిట్లు కూడా విద్యుత్ సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ 18, కర్నాటక 18, కేరళ 12, తమిళనాడు 67, పాండిచ్చేరి 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత మాత్రమే ఉంటే.. ఏపీలో అది 382 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ల నుంచి గత మూడు నెలల కాలంలో అత్యధిక ధరలకు  విద్యుత్‌ను కొనుగోలు చేయడం వలన రూ.1037 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. ఈ భారం చార్జీల రూపంలో ప్రజలపై మోపుతూ వారి నడ్డి విరుస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను పట్టాభిరామ్ మీడియా సమావేశంలో బయటపెట్టారు.

Updated Date - 2022-06-12T21:06:36+05:30 IST