Peddireddy కనుసన్నల్లోనో Mining Mafia: Pattabhi

ABN , First Publish Date - 2022-07-14T20:38:42+05:30 IST

పెద్దిరెడ్డి కనుసన్నల్లోనో మైనింగ్ మాఫియా నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు.

Peddireddy కనుసన్నల్లోనో Mining Mafia: Pattabhi

అమరావతి (Amaravathi): పెద్దిరెడ్డి (Peddireddy) కనుసన్నల్లోనో మైనింగ్ మాఫియా (Mining Mafia) నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ (Pattabhiram) ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భారతీ సిమెంట్స్ (Bharti Cements) అక్రమార్జనతోనే లాభాల బాటలో నడుస్తోందన్నారు. ‘‘రిషికొండ అంశంలో శాటిలైట్ ఇమేజెస్ కావాలన్నారు.. చంద్రబాబు (Chandrababu)కు టెక్నాలజీని మీరు నేర్పిస్తారా?.. మీరు అక్రమాలు చేయకముందు.. తర్వాత శాటిలైట్ ఇమేజెస్ మా దగ్గర ఉన్నాయి.’’ అని పట్టాభి అన్నారు.


శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగానే రిషికొండ అక్రమాలపై ఆరోపణలు చేస్తున్నామని పట్టాభి పేర్కొన్నారు. రిషికొండను ఎలా ధ్వంసం చేశారో ఇమేజెస్లో స్పష్టంగా ఉందన్నారు. అక్రమ తవ్వకాలతో రిషికొండను పిండి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గాలి జనార్ధన్రెడ్డికి పట్టిన గతే పెద్దిరెడ్డికి పడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ తవ్వకాలపై చర్యలుంటాయని, అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిని జైలుకు పంపిస్తామని పట్టాభి రామ్ అన్నారు.

Updated Date - 2022-07-14T20:38:42+05:30 IST