అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారు: పట్టాభి

ABN , First Publish Date - 2022-02-10T18:31:04+05:30 IST

అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు.

అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారు: పట్టాభి

అమరావతి: అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్ అండ్ మీన్స్‌, ఓవర్ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే..ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు చేబదుళ్లు లేకుండా, 22 రాష్ట్రాలు ఓడీ లేకుండా..15 రాష్ట్రాలు స్పెషల్ డ్రాయింగ్‌లు లేకుండా పాలన చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రాలపై కరోనా ప్రభావం లేదా? అని ప్రశ్నించారు.


ఏపీ 112 రోజులు ఓవర్ డ్రాప్టు, 193 రోజులు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులకెళ్లి.. రూ. 32,217 కోట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని పట్టాభి ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేబదుళ్లు తీసుకోవడమంటే.. ఏపీ ఆర్థికంగా ఐసీయూలో ఉన్నట్టు కాదా? అని అన్నారు. తక్షణమే ఈ లెక్కలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-10T18:31:04+05:30 IST