Court అనుమతులు ఉల్లంఘించి జగన్ లండన్ వెళ్లారు: పట్టాభి
ABN , First Publish Date - 2022-05-22T18:32:37+05:30 IST
కోర్టు అనుమతులు ఉల్లంఘించి సీఎం జగన్ (CM Jagan) లండన్ వెళ్లారని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు.
అమరావతి: కోర్టు అనుమతులు ఉల్లంఘించి సీఎం జగన్ (CM Jagan) లండన్ వెళ్లారని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్తో పాటు విమానంలో అధికారులెవరూ వెళ్లలేదని తెలిపారు. ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో 2 గంటలు మాత్రమే పట్టిందన్నారు. జగన్, లండన్ (London) వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనకు జగన్ విలాసవంతమైన విమానంలో వెళ్లారని తప్పుబట్టారు. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ... దాచిన డబ్బు తేవడానికే జగన్రెడ్డి దావోస్ వెళ్లారని పట్టాభి ఆరోపించారు.