ఈ అవినీతి ప్రభుత్వాన్ని చూసి ఏపీలో పెట్టుబడులు పెడతారా?: పట్టాభి
ABN , First Publish Date - 2022-01-18T23:06:43+05:30 IST
ఈ అవినీతి ప్రభుత్వాన్ని చూసి ఎవరైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
అమరావతి: ఈ అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఏపీలో ఎవరైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జగన్రెడ్డి, వైసీపీ నేతలకు క్యాసినోలపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఏపీలో జగన్రెడ్డి పనితీరుతో పెట్టుబడులు వస్తున్నాయంటూ.. సాక్షి అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. 2017 జనవరిలో చంద్రబాబు ఓఎన్జీసీతో ఒప్పందం చేసుకొని.. రూ.78 వేలకోట్ల పెట్టుబడులు తెస్తే అది జగన్రెడ్డి ఖాతాలో ఎలా వేస్తారు? అని ప్రశ్నించారు.వైసీపీ అరాచకాలతో ఏ కంపెనీ కూడా ఏపీకి రావడం లేదన్నారు. సీఎం చేతగానితనం వల్లే టెస్లా కంపెనీ చేజారిపోయిందని మండిపడ్డారు. ఇదేనా సాక్షిలో రాసిన పారిశ్రామికాభివృద్ధి? అని పట్టాభి నిలదీశారు.