AP News: జగన్‌ సర్కార్‌పై పట్టాభి విమర్శలు

ABN , First Publish Date - 2022-08-12T21:36:46+05:30 IST

అమరావతి: జగన్‌ సర్కార్‌పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం జనం నుంచి బాదుడు మొదలుపెట్టిందని, ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పేరుతో రూ.20 వేల కోట్లు బాదేశారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో ఓ వైపు జగన్‌

AP News: జగన్‌ సర్కార్‌పై పట్టాభి విమర్శలు

అమరావతి: జగన్‌ సర్కార్‌పై టీడీపీ నేత పట్టాభి (Pattabhi) విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం జనం నుంచి బాదుడు మొదలుపెట్టిందని, ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పేరుతో రూ.20 వేల కోట్లు బాదేశారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో ఓ వైపు జగన్‌ బటన్‌ నొక్కుతూ..మరోవైపు ఛార్జీల పేరుతో తిరిగి డబ్బునురాబట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్‌ పాలన (CM YS Jagan)లో విద్యుత్‌ డిస్కంలు నాశనమయ్యాయని, ఏపీలో డిస్కంలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని  పేర్కొన్నారు.  ఏపీ డిస్కంలకు మొత్తం రూ.38,836 కోట్ల అప్పులున్నాయని, దీనిపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందని పట్టాభి చెప్పారు. 


Updated Date - 2022-08-12T21:36:46+05:30 IST