దౌర్జన్యానికి దాసోహమా!

ABN , First Publish Date - 2021-10-21T06:52:00+05:30 IST

ఏలినవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు.

దౌర్జన్యానికి దాసోహమా!
పట్టాభి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

ఏలినవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. పోలీసులను అడ్డుపెట్టుకుని నేరాలను తారుమారు చేయగలరు. బాధితులనే నేరస్తులుగా చిత్రించగలరు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అరెస్టు ఇందుకు నిలువెత్తు నిదర్శనం. పట్టాభి దంపతులు లేని సమయంలో వారి ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించింది వైసీపీ మూకలు.. ఆ విధ్వంసంలో నష్టపోయింది పట్టాభి కుటుంబం. న్యాయం కోసం పాలకులను నిలదీయాల్సిన పట్టాభిని ఇప్పుడు బలవంతంగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయుధాలతో ఆ ఇంట్లో వీరంగం వేసి, విధ్వంసం సృష్టించిన వైసీపీ మూకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన నేరానికి పట్టాభికి సంకెళ్లు పడ్డాయి.. రాజ్యమా.. దౌర్జాన్యానికి దాసోహమా? - ఆంధ్రజ్యోతి, విజయవాడ

Updated Date - 2021-10-21T06:52:00+05:30 IST