తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్తో రైతు హల్చల్
ABN , First Publish Date - 2020-02-20T07:23:39+05:30 IST
తనకు సంబంధించిన భూమిని పాస్బుక్కులో తక్కువగా నమోదు చేశారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఓ రైతు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం
సంగారెడ్డి రూరల్, ఫిబ్రవరి 19: తనకు సంబంధించిన భూమిని పాస్బుక్కులో తక్కువగా నమోదు చేశారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఓ రైతు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ తన భూమిని పాస్బుక్కుల్లో తక్కువగా నమోదు చేశారని, సవరించి మొత్తం భూమిని నమోదు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీంతో విసుగు చెందిన రైతు పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది వారించి బాటిల్ను పక్కన పారవేయడంతో ప్రమాదం తప్పింది. అధైర్య పడవద్దని ఽన్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు ధైర్యం చెప్పి పంపించారు.