విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలి
ABN , First Publish Date - 2022-08-16T06:22:29+05:30 IST
విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ సోమయాజులు అన్నారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు
మహారాణిపేట, ఆగస్టు 15: విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ సోమయాజులు అన్నారు. వన్టౌన్లోని ఏవీఎన్ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏవీ ఆది భానోజీరావు, ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.