విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలి

ABN , First Publish Date - 2022-08-16T06:22:29+05:30 IST

విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు అన్నారు.

విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలి
ఏవీఎన్‌ కళాశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ సోమయాజులు

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు

మహారాణిపేట, ఆగస్టు 15: విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు అన్నారు. వన్‌టౌన్‌లోని ఏవీఎన్‌ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ ఏవీ ఆది భానోజీరావు, ప్రిన్సిపాల్‌ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:22:29+05:30 IST