దేశభక్తి అంటే ఎవరి పని వారు చేయడమే: వెంకయ్యనాయుడు
ABN , First Publish Date - 2022-03-02T23:59:03+05:30 IST
దేశభక్తి అంటే ఎవరి పని వారు చేయడమేనని ఉపరాష్ట్రపతి
పశ్చిమ గోదావరి: దేశభక్తి అంటే ఎవరి పని వారు చేయడమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏలూరులో సీఆర్ రెడ్డి కాలేజ్ 75 వసంతాల వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభ్యుదయ పథంలో నడపాలంటే మంచి లక్షణాలు ఉండడం అవసరమన్నారు. రాజకీయాల్లో దురదృష్టకర పోకడలు వస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే శక్తివంతమైన దేశంగా మారుతుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధే లక్ష్యంగా విద్య ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు.