రోగులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే రోజా
ABN , First Publish Date - 2020-05-28T10:32:49+05:30 IST
ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం నగరిలోని వైద్య విధాన
నగరి, మే 27: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం నగరిలోని వైద్య విధాన పరిషత్ ఏరియా ఆస్పత్రిలో హెచ్డీఎస్ కమిటీ చైర్మన్ రోజా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సరళమ్మ, ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.