వైద్యులపై విరుచుకుపడిన పేషెంట్ అరెస్ట్.. బహ్రెయిన్‌లో..

ABN , First Publish Date - 2021-03-16T16:11:00+05:30 IST

చికిత్స సమయంలో ఇద్దరు వైద్యులపై విరుచుకుపడిన రోగిని పోలీసులు అదుపులో తీసుకున్న ఘటన బహ్రెయిన్‌లో చోటుచేసుకుంది.

వైద్యులపై విరుచుకుపడిన పేషెంట్ అరెస్ట్.. బహ్రెయిన్‌లో..

మనామా: చికిత్స సమయంలో ఇద్దరు వైద్యులపై విరుచుకుపడిన రోగిని పోలీసులు అదుపులో తీసుకున్న ఘటన బహ్రెయిన్‌లో చోటుచేసుకుంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్‌ఎంసీ) ఎమర్జెన్సీ విభాగంలో పొత్తి కడుపు నొప్పికి చికిత్స పొందిన సదరు పేషెంట్.. మెడికల్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్ ప్రొసీజర్స్‌కు నిరాకరించాడు. దాంతో తమకు సహకరించాల్సిందిగా కోరిన ఇద్దరు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దాంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. వారి సమాచారంతో ఎస్ఎంసీకి చేరుకున్న పోలీసులు సదరు రోగిని సముదాయించే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. పైగా పోలీస్ అధికారిని కూడా దూషించాడు. దీంతో చేసేదేమిలేక పోలీసులు ఆ పేషెంట్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-03-16T16:11:00+05:30 IST