పాస్‌పోర్ట్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ సగానికి తగ్గింపు!

ABN , First Publish Date - 2021-05-01T12:58:23+05:30 IST

కరోనా నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ సగానికి తగ్గించామని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.

పాస్‌పోర్ట్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ సగానికి తగ్గింపు!

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ సగానికి తగ్గించామని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. బేగంపేటలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో 820 మందికి స్లాట్‌ బుకింగ్‌ అవకాశం ఉండగా.. దీనిని 410కి తగ్గించామన్నారు. అలాగే అమీర్‌పేట సేవా కేంద్రంలో 700 నుంచి 350, టోలీచౌకీలో 750 నుంచి 350, నిజామాబాద్‌లో 270 నుంచి 135, కరీంనగర్‌లో 200 నుంచి 100కి తగ్గించామని చెప్పారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఇప్పటికే బుక్‌ చేసిన స్లాట్‌లోనూ తర్వాత తేదీలకు మార్చుకోవచ్చని వివరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్‌ ఆఫీసు సేవా కేంద్రాల్లోనూ 14 వరకు సేవలను రద్దుచేసినట్లు తెలిపారు.


Updated Date - 2021-05-01T12:58:23+05:30 IST