నేటి నుంచి పాస్పోర్టు సేవలు షురూ!
ABN , First Publish Date - 2021-06-01T14:02:44+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునఃప్రారంభించనున్నారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునఃప్రారంభించనున్నారు. హైదరాబాద్(బేగంపేట్, అమీర్పేట్,టోలిచౌకి), నిజామాబాద్, కరీంనగర్తో పాటు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం, సచివాలయంలోని అటెస్టేషన్కేంద్రంలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.