నిత్యవసర వస్తువుల రవాణా వాహనాలకు పాసులు

ABN , First Publish Date - 2020-03-27T05:53:32+05:30 IST

నిత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఆర్డీవో సరోజిని ద్వారా పాసులను మంజూరు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఆర్డీవో

నిత్యవసర వస్తువుల రవాణా వాహనాలకు పాసులు

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు 

ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య


నాయుడుపేట టౌన్‌, మార్చి 26 : నిత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఆర్డీవో సరోజిని ద్వారా పాసులను మంజూరు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిత్యవసర దుకాణందారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యవసర సరుకులను అందించేందుకు సంబంధించిన వాహనాలకు పాసులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మీడియాకు కూడా పాసులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆర్డీవో సరోజిని మాట్లాడుతూ నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నాయుడుపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, తూనికల కొలతల అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జీవీ సుబ్బారెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీటీ సంఽధ్యా పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T05:53:32+05:30 IST