ఎండీఎం వాహనంలో ప్రయాణికులు
ABN , First Publish Date - 2022-02-28T01:38:24+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా రేషన్ సరుకుల పంపిణీ కోసం మంజూరు చేసిన ఎండీఎం వాహనాలను కొందరు డ్రైవర్లు
రాజాం: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా రేషన్ సరుకుల పంపిణీ కోసం మంజూరు చేసిన ఎండీఎం వాహనాలను కొందరు డ్రైవర్లు, ప్రయాణికుల కోసం వినియోగిస్తున్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన ఓ వాహనం(ఏపీ39టీఆర్ 5437)లో ప్రయాణికులను ఎక్కించి.. శ్రీకాకుళం జిల్లా వత్సవలస జాతరకు వెళ్లారు. ఆదివారం తిరిగొస్తుండగా.. రాజాంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఈ వాహనం ‘ఆంధ్రజ్యోతి’కి కనిపించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రైవర్లు ఈ వాహనాలను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.