రోడ్డు పక్కన ఓ వృద్ధుడి మృతదేహం.. అటుగా వెళ్తుండగా చూసి పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. అరగంటలోనే వీడిన మిస్టరీ..!

ABN , First Publish Date - 2022-06-20T20:47:13+05:30 IST

ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులతో కాస్త బిజీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ దారిలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు.. రోడ్డు పక్కన ఓ వృద్ధుడి మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడ

రోడ్డు పక్కన ఓ వృద్ధుడి మృతదేహం.. అటుగా వెళ్తుండగా చూసి పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. అరగంటలోనే వీడిన మిస్టరీ..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులతో కాస్త బిజీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ దారిలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు.. రోడ్డు పక్కన ఓ వృద్ధుడి మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. కేవలం అరగంటలోనే ఆ వృద్ధుడు ఎవరు అనే వివరాలతో పాటు అతడి మరణానికి గల కారణాన్ని గుర్తించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై వెళ్తున్న కొందరు ప్రయాణికులు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో.. రోడ్డు పక్కన ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కోత్వాలి దేహల్ పోలీస్ స్టేషన్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతుడి ముఖంపై గాయాలను గమనించి అధికారులు.. వృద్ధుడిని ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక అతడు ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడా అనే సందిగ్ధంలో పడ్డారు. అయితే పోలీసులకు మృతుడి ఫోన్ దొరకడంతో.. అతడి మరణానికి గల కారణంపై ఓ క్లారిటీకి వొచ్చారు. 



మృతదేహానికి కొద్ది దూరంలో సెల్‌ఫోన్‌ను గుర్తించిన అధికారులు.. ఫోన్ ద్వారా మృతుడిని మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 60ఏళ్ల మోహన్ మిస్త్రీగా గుర్తించారు. అంతేకాకుండా అతడు మద్యానికి బానిసైనట్లు తెలుసుకున్న అధికారులు.. మద్యం మత్తులో రోడ్డుపై ప్రయాణం చేస్తుండగా యాక్సిండెట్ కావడంతో అతడు ప్రాణాలు విడిచినట్టు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అతడికి యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-06-20T20:47:13+05:30 IST