బ్యాగులో రూ.4.50 లక్షల డబ్బుతో రైల్లో ప్రయాణం చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తలకింద పెట్టుకుని..
ABN , First Publish Date - 2021-12-13T22:14:13+05:30 IST
ట్రాలీ బ్యాగ్ తల కింద పెట్టుకుని ట్రైన్లో నిద్రపోయిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
ట్రాలీ బ్యాగ్ తల కింద పెట్టుకుని ట్రైన్లో నిద్రపోయిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. మధ్య రాత్రి మెళకువ వచ్చి చూస్తే తల కింద బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగ్లో రూ.4.50 లక్షల నగదు, ఏటీఎమ్ కార్డులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. దీంతో అతను వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. వారి సూచన మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. హర్యానాలోని అంబాలాలో ఈ ఘటన జరిగింది.
ఖాన్ సింగ్ అనే వ్యక్తి జోధ్పూర్ వెళ్లేందుకు హరిద్వార్ రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం ట్రైన్ ఎక్కాడు. జోధ్పూర్లో ఓ వ్యక్తికి డబ్బులు కట్టేందుకు రూ.4.5 లక్షలు తనతో పాటు బ్యాగ్లో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటలకు ట్రైన్ ఎక్కి డబ్బులు ఉన్న బ్యాగ్ను తల కింద పెట్టి పడుకున్నాడు. రాత్రి రెండు గంటల సమయంలో మెళకువ వచ్చి చూడగా అతని తల కింద బ్యాగ్ లేదు. కంగారు పడిన ఖాన్ సింగ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు జోధ్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా జీరో ఎఫ్ఐఆర్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు.