ప్రయాణికులను కాపాడి మృతిచెందిన Driver
ABN , First Publish Date - 2022-03-19T13:52:40+05:30 IST
గుండెపోటుకు గురైనా ప్రయాణికులను సురక్షితంగా రక్షించి బస్సు డ్రైవర్ మృతిచెందిన ఘటన పొన్నేరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. తిరువళ్లూర్
గుమ్మిడిపూండి(చెన్నై): గుండెపోటుకు గురైనా ప్రయాణికులను సురక్షితంగా రక్షించి బస్సు డ్రైవర్ మృతిచెందిన ఘటన పొన్నేరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. తిరువళ్లూర్ జిల్లా పళవేర్కాడు నుంచి పొన్నేరికి శుక్ర వారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రభు త్వ బస్సు బయల్దేరింది. భారతినగర్ సమీపంలో డ్రైవర్ గోపాల్కు హఠాత్తుగా గుండెపోటు రాగా, కొద్ది దూరంల ఐస్ ఫ్యాక్టరీ వద్ద బస్సు నిలిపి పక్కకు ఒరిగిపోయాడు. కండక్టర్ బలరామన్ వెంటనే 108 అంబులెన్స్ను రప్పించి గోపాల్ను పొన్నేరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చినా లెక్కచేయకుండా ప్రయాణికులను రక్షించి డ్రైవర్ మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పొన్నేరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.