ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-09T00:08:45+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులను

ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు, ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు.  దీంతో వివిధ ప్రదేశాలకు వెళ్లేవారితో ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. సంక్రాంతి సెలవులతో జనం సొంతూళ్ళ బాట పట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ దగ్గర ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. బస్టాండ్లలోని స్టాల్స్‌లో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న వారిపై  టీఎస్ఆర్టీసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు, రేపు ఆర్టీసీ బస్టాండ్లలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 




Updated Date - 2022-01-09T00:08:45+05:30 IST