-
-
Home » Andhra Pradesh » Parvathipuram manyam andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
అధికారులపై ఉప ముఖ్యమంత్రి Rajanna dora ఆగ్రహం
ABN , First Publish Date - 2022-05-13T19:52:32+05:30 IST
జిల్లాలోని సాలూరు అధికారులపై ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం: జిల్లాలోని సాలూరు అధికారులపై ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర (Rajanna dora) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ పథకాలు ఇస్తున్నారంటూ ఓ ప్రశ్నకు లబ్దిదారులు బదులిచ్చారు. దీనిపై ఉపముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హయాంలో చంద్రబాబు పేరు వినిపించిందని.... ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ (Jagan) పథకం ఇచ్చారని చెప్పాలి గాని, వాలంటీర్ల పేరెందుకు పదే పదే లబ్దిదారులు ప్రస్తావిస్తున్నారని రాజన్న దొర మండిపడ్డారు. వాలంటీర్ మాట లబ్దిదారుల నోట వినిపిస్తే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు. మున్సిపల్ కమీషనర్, ఎం.పి.డి.ఒలకు ఉప ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు.