Parvathipuram జిల్లా: Kurupamలో ఎలుగుబంటి సంచారం కలకలం

ABN , First Publish Date - 2022-06-24T16:03:26+05:30 IST

కురుపాం (Kurupam) మండలంలో ఎలుగుబంటి (Bear) సంచారం కలకలం రేపుతోంది.

Parvathipuram జిల్లా: Kurupamలో ఎలుగుబంటి సంచారం కలకలం

పార్వతీపురం (Parvathipuram) జిల్లా: కురుపాం (Kurupam) మండలంలో ఎలుగుబంటి (Bear) సంచారం కలకలం రేపుతోంది. జీఎంవలస పంచాయతీ, సూర్యనగర్ పొలిమేరలో ఎలుగుబంటిని చూసినట్లు స్థానికులు తెలిపారు. ఓ పాములపుట్టను ఎలుగుబంటి కాలితో తవ్వేసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని ఎలుగుబంటి ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు.


తెలుగులు రాష్ట్రాల్లో ఎలుగుబంట్లు స్వైరవిహారం చేస్తున్నాయి. మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హడలెత్తించింది. ఎలుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఒంగోలు జిల్లాలో ఎలుగు కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. త్వరగా ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఎలుగు టెన్షన్ రేపుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలుగు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.

Updated Date - 2022-06-24T16:03:26+05:30 IST