కశ్యప్, సాయి ప్రణీత్ విరాళాలు
ABN , First Publish Date - 2020-04-09T10:09:14+05:30 IST
తెలుగు షట్లర్లు పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్ పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేశారు. కశ్యప్ తెలంగాణ సీఎం సహాయ నిధికి ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు షట్లర్లు పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్ పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేశారు. కశ్యప్ తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.3 లక్షల విరాళం ఇచ్చాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య పోలీస్ సిబ్బందికి సెల్యూట్ చేయాలని కశ్యప్ ట్వీట్ చేశాడు. మరో షట్లర్ సాయి ప్రణీత్ రూ.3 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.1 లక్ష తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు బుధవారం అందించాడు.