కశ్యప్‌, సాయి ప్రణీత్‌ విరాళాలు

ABN , First Publish Date - 2020-04-09T10:09:14+05:30 IST

తెలుగు షట్లర్లు పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ పీఎం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు అందజేశారు. కశ్యప్‌ తెలంగాణ సీఎం సహాయ నిధికి ...

కశ్యప్‌, సాయి ప్రణీత్‌ విరాళాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు షట్లర్లు పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ పీఎం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు అందజేశారు. కశ్యప్‌ తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.3 లక్షల విరాళం ఇచ్చాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య పోలీస్‌ సిబ్బందికి సెల్యూట్‌ చేయాలని కశ్యప్‌ ట్వీట్‌ చేశాడు. మరో షట్లర్‌ సాయి ప్రణీత్‌ రూ.3 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.1 లక్ష తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు బుధవారం అందించాడు.

Updated Date - 2020-04-09T10:09:14+05:30 IST