ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-15T01:05:13+05:30 IST

ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో

ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారు: చంద్రబాబు

అమరావతి: ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నిచోట్ల ప్రాణాలు కూడా పణంగా పెట్టారని తెలిపారు. టీడీపీ శ్రేణుల పోరాట స్ఫూర్తికి ఆయన వందనాలు తెలిపారు. ఫలితాలను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం.. ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-15T01:05:13+05:30 IST