పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి : కురుగొండ్ల
ABN , First Publish Date - 2022-09-28T03:08:11+05:30 IST
టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. మంగళ
కలువాయి, సెప్టెంబరు 27: టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి పరసారత్నంతో కలిసి కలువాయి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్థంగా ఉండాలన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలంతా బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే పార్టీ అభివృద్ధి జరుగుతుందన్నారు. పరసారత్నం మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతులు ఎంతో అభివృద్ధి చెందారని, నేడు వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సమావేశంలో నాయకులు జెన్ని రమణయ్య, జీ.వెంకటేశ్వర్లునాయుడు, జగదల్నాయుడు, చల్లా విజయభాస్కర్రెడ్డి, గడ్డం కిషోర్రెడ్డి, చిలుకూరి ప్రసాద్, చంద్రయ్య నాయుడు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.