భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-02-28T04:31:58+05:30 IST
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లో పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ అన్నారు.
భీమ్గల్, ఫిబ్రవరి27: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లో పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్ కార్యాలయంలో మల్లెల రాజశ్రీ అధ్య క్షతన నిర్వహించారు. కార్యాలయ నిర్వహణ, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన అంశాలపై సభ్యులు, శాఖల అధికారులు వివరించారు. సమా వేశం లో కమిషనర్ గోపు గంగాధర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.