పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-10-19T03:33:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు
వైఎస్సార్‌ ఆసరా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే ఆనం

బాలాయపల్లి, అక్టోబరు 18: రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడూరు భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వాన పార్వతి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దారు నౌషద్‌అహ్మద్‌, ఏసీ మురళి ఏపీఎం కిరణ్‌, సర్పంచులు దట్టం అంజలి, మన్నెమాల గోపీకృష్ణారెడ్డి, ఎంపీటీ సభ్యులు సురేంద్రరెడ్డి, మురళీరెడ్డి, రాయి దేవికా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T03:33:35+05:30 IST