గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీపీవో

ABN , First Publish Date - 2021-06-22T05:22:57+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డివిజనల్‌ పంచాయతీ అధికారి సతీష్‌ హెచ్చరించారు.

గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీపీవో

హత్నూర, జూన్‌ 21: గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డివిజనల్‌ పంచాయతీ అధికారి సతీష్‌ హెచ్చరించారు. సోమవారం హత్నూర మండలం ముచ్చర్ల, చింతల్‌చెర్వు, గుండ్లమాచునూర్‌, తుర్కలఖానాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, నర్సరీలను పరిశీలించారు. గుండ్లమాచునూర్‌, తుర్కలఖానాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని రెండు గ్రామాల కార్యదర్శులకు షోకాస్‌ నోటీసులు ఇచ్చారు.

పోసానిపేటలో ఆకస్మిక తనిఖీ

జోగిపేట: అందోలు మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి పోసానిపేటను సందర్శించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లోని మురుగు కాల్వలను ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. రహదారి వెంట నాటిన మొక్కల ట్రీ గార్డులు కిందపడిపోవడంతో వాటిని సరి చేయాల్సిందిగా సర్పంచ్‌ను ఆదేశించారు. 



Updated Date - 2021-06-22T05:22:57+05:30 IST