పల్లెప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి

ABN , First Publish Date - 2021-01-21T04:14:27+05:30 IST

పల్లెప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

పల్లెప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి

అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఇచ్చోడ, జనవరి 20: పల్లెప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ గ్రామపంచాయతీలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. పనులను త్వరిత గతిన పూర్తి చేయాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో రాజేశ్వర్‌, ఉపాధిహామీ ఏపీడీ రవీందర్‌, ఎంపీడీవో రాంప్రసాద్‌, ఎంపీవో రమేష్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:14:27+05:30 IST