హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ABN , First Publish Date - 2021-06-13T05:03:51+05:30 IST
హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీ ఆర్డీవో పీడీ చందర్నాయక్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గ న్నారం, దేవితండా, చంద్రాయన్పల్లి గ్రామాలను శనివారం సందర్శించా రు. అవెన్యూప్లాంటేషన్లో భాగంగా మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన నాలుగు వరుసల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించేవిధంగా చూడాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు అవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి మార్కింగ్, ఫిట్టింగ్పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములునాయక్, ఎంపీవో సుభాష్చంద్రభోస్, ఏపీవో మంజుల, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
డిచ్పల్లి, జూన్ 12: హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీ ఆర్డీవో పీడీ చందర్నాయక్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గ న్నారం, దేవితండా, చంద్రాయన్పల్లి గ్రామాలను శనివారం సందర్శించా రు. అవెన్యూప్లాంటేషన్లో భాగంగా మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన నాలుగు వరుసల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించేవిధంగా చూడాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు అవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి మార్కింగ్, ఫిట్టింగ్పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములునాయక్, ఎంపీవో సుభాష్చంద్రభోస్, ఏపీవో మంజుల, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
ఆర్మూర్రూరల్: గ్రామాలలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతీఒక్కరు తీసుకోవాలని డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. చేపూర్లో శని వారం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. చేపూర్ గ్రామం నుంచి 63వ జాతీయరహదారి ఇరువైపుల 600మొక్కలు నాటడానికి మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపిబాబు, సర్పంచ్ ఇందూర్ సాయన్న, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
జాతీయ రహదారికి ఇరువైపుల ప్లాంటేష్కు ఏర్పాటుకు సన్నాహాలు
కమ్మర్పల్లి: జాతీయ రహదారి 63కు ఇరువైపుల ఉన్న ఖాళీ స్థలాల్లో ప్లాంటేష్న్ ఏర్పాటుకు అధికారులు శనివారం కమ్మర్పల్లి శివారులో సర్వే కార్యక్రమాలను చేపట్టారు. జాతీయరహదిరికి ఇరువైపులా ఉండే ఖాళీ స్థ లాల్లో రెండు లేదా మూడు వరుసల ప్లాంటేషన్ ఎర్పాటు చేయాలని కలెక్ట ర్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల సరిహద్దు కుందేలుగుట్ట పరిసరాల్లో నుంచి జిల్లా సరిహద్దు గండిహనుమాన్ వరకు రహదారికి ఇరువైపుల ప్లాంటేషన్ ఏర్పాటుకు అధికారులు సర్వే నిర్వహించారు. సరిహద్దు మొ త్తం 5 కిలోమీటర్లు కాగా అందులో గ్రామం వదిలి మిగిలిని ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెట్పల్లికి వచ్చిన సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాల్లోని జాతీయ రహదారుల వెంట ప్లాంటేషన్ తక్కువగా ఉందని ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని అట్టి స్థలాల్లో ప్లాంటేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జా రీ చేసినట్లు తెలసింది. ఈ మేరకు శనివారం జాతీయరహదారుల డిప్యూ టీ ఈఈ శంకర్ సర్వేలో పాల్గొన్నారు. ఖాళీస్థలాల్లో గుంతలు తవ్వించి ప్లాంటేషన్, ట్రీగాడ్ల ఏర్పాటు బాధ్యతల్ని అటవీశాఖ అధికారులకు అ ప్పగించగా మొక్కల సంరక్షణ బాధ్యతలు గ్రామపంచాయతీకి అప్పగించా రు. ఖాళీస్థలాల్లో రెండువరుసలు చేసి వరసలో 4 వందల మొక్కల చొ ప్పున ఏర్పాటుకు సన్యాహాలు చేస్తున్నారు. సర్వేలో ఎంపీడీవో సంతోష్ రె డ్డి, ఎఫ్ఆర్వో రవీందర్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఎపీవో విద్యానంద్, పం చాయతీ కార్యదర్శి శాంతికుమార్, ఫారెష్ట్ బీట్ ఆఫీసర్స్ లక్ష్మీనారాయణ, నవీన్రాజ్, టీఏ మారుతి, తేజ, సురేష్ పాల్గొన్నారు.
సిద్ధం కావాలి
ముప్కాల్: మూడోవిడత తెలంగాణ హరితహారం కార్యక్రమానికి సిద్ధం కావాలని ఏపీడీ సంజీవ్ అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంతో పాటు కొత్తపల్లి, వేంపల్లి గ్రామాల నేషనల్ హైవే 44రహదారి ఇరువైపుల మొ క్కలు నాటడానికి సర్వే నిర్వహించారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటి వా టిని సంరక్షించాలని కోరారు. రహుదారులకు ఇరువైపుల మల్టిలేయర్లతో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో ఇందిరా, ఎం పీవో భరత్, సర్పంచ్లు జక్క మల్లుబాయి, మారెల్లి విష్ణు, కొమ్ముల శ్రీని వాస్, జక్కుమల్లుబాయి, సెక్రెటరీ భరత్, రాజలక్ష్మీ, నేషనల్ హైవే సిబ్బం ది, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని డీఆర్డీవో పీడీ చందర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా ముఖ్యమన్నారు. ఖాళీ స్థలాల్లో ప్రస్తుత సీజన్లో మొక్కలు నాటి పచ్చదనం కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.