రామమందిర నిర్మాణంలో భాగస్వాములవ్వాలి
ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST
రామమందిర నిర్మాణంలో భాగస్వాములవ్వాలి
- బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి
- భారీగా విరాళాల సేకరణ
చేవెళ్ల /షాబాద్ : అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, భజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ గూడెం రమేష్, వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు బోజిరెడ్డి అన్నారు. ఆదివారం షాబాద్ మండలపరిధి మన్మర్రి, తిర్మలాపూర్, చిన్నసోలిపేట, బొబ్బిలిగామ, ఎట్లఎర్రవల్లి, చేవెళ్ల మండలంఊరెళ్ల గ్రామంలో శ్రీ రామజన్మభూమిక్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల స్వప్నం నేరవేరబోతోందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, సత్యనారాయణ, మల్లేష్, లక్ష్మయ్య, అనంతయ్య, ప్రభాకర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, మైపాల్రెడ్డి, శ్రీరాంరెడ్డి, రాములు, మల్లయ్య, బాస్కర్రెడ్డి, అంజయ్య, గోపాల్, అనంతయ్య పాల్గొన్నారు.
నందిగామలో...
నందిగామ: రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి దేపల్లి అశోక్గౌడ్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో హిందూవాహిని, విశ్వహిందూపరిషత్ సభ్యులు నిఽధిని సేకరించారు. కార్యక్రమంలో కుమార్గౌడ్, వెంకటే్షగౌడ్, కృష్ణారెడ్డి, శివకుమార్, అగ్గి ప్రవీణ్, దాసరి శ్రీశైలం, పూర్ణం శ్రీకాంత్, శ్రీనివా్సరెడి,్డ అరవింద్, అశోక్, మల్లేష్, వజ్రంగౌడ్, ప్రశాంత్, కన్న తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య రాముడిగుడికి భారీ విరాళాలు
షాద్నగర్అర్బన్: అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఫరూఖ్నగర్ మండలంలోని మధురాపురం గ్రామానికి చెందిన ఎంఎన్ఆర్ సేవా సంస్థ అధినేత డాక్టర్ ఎం. నరేందర్రెడ్డి రూ. 6.16లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ట్రస్టు సభ్యులకు చెక్కును అందజేశారు. షాద్నగర్కు చెందిన పౌల్ర్టీపారిశ్రామికవేత్త పాతూరి వెంకటరావు లక్షా 11వేల 111 రూపాయల చెక్కును ఇచ్చారు. షాద్నగర్కు చెందిన డాక్టర్ శేరినాగిరెడ్డి లక్ష రూపాయలను ఇచ్చారు. వ్యాపారి గబ్బుల శ్రీలతాశ్రీనివాస్ రూ. 51వేలు అందజేశారు. రవీంద్రనాథ్ రూ.25వేలు, రంగయ్య రూ.25వేలు, నరేందర్ రూ. 21వేలు అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. దాతలకు ట్రస్టు సభ్యులు ఎన్. శ్రీవర్ధన్రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, మలిపెద్ది శంకర్, చెంది మహేందర్రెడ్డి, పి. వెంకటేశ్వర్రెడ్డి, మఠం రాచయ్య, చెట్ట వెంకటేష్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
అందరూ చేయూతనందించాలి
ఆమనగల్లు/శంషాబాద్రూరల్/యాచారం: ఆమనగల్లు పట్టణంలో ఆదివారం బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎ్సఎస్ ఆధ్వర్యంలో శ్రీరాముడి భారీ శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం నేపథ్యంలో నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా సంఘ్ నాయకులు ఇంటింటికీ వెళ్లి రామమందిర నిర్మాణ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బావండ్ల అంజయ్య, దొంతు విశ్వనాథం, పాపిశెట్టి రాము, మాధవాచారి, చుక్క ఆనంద్, పాతకోట శ్రీశైలం,సుండూరు శేఖర్, కండె హరిప్రసాద్, రాంపాల్ నాయక్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. అయ్యోధ రామ మందిర ఽనిఽధి సేకరణలో భాగంగా ఆదివారం శంషాబాద్ మండల పరిధి నర్కూడలో బీజేపీ నేత బుక్క వేణుగోపాల్ ఇంటింటికీ తిరిగి విరాళలు సేకరించారు. కార్యక్రమంలో జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్, కుమార్యాదవ్, శ్రీనివాస్, మెండె కుమార్, బుర్కుంట గోపాల్, సంజీవ, శివ పాల్గొన్నారు. యాచారం పంచాయతీ పరిధి గాండ్లగూడలో వృద్ధురాలైన ఎల్లమ్మ(80) తనకు వచ్చే పింఛన్ నుంచి రూ.500 రామమందిర నిర్మాణానికి విరాళాంగా ఆదివారం అందజేసింది. ఈ సందర్భంగా పలువురు యువకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు.