‘కొల్లు’ అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపే

ABN , First Publish Date - 2020-07-06T10:50:35+05:30 IST

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీమంత్రి కొల్లు ర వీంద్రను అరెస్టు చేశారని..

‘కొల్లు’ అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపే

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి


అనంతపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి) : రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీమంత్రి కొల్లు ర వీంద్రను అరెస్టు చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పా ర్థసారథి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలనలో ప్రజ లకు జరుగుతున్న అన్యాయాలపై కొల్లు రవీంద్ర పోరాటం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే ఆయనపై కక్షగట్టారన్నా రు. కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. సౌమ్యుడిగా పే రొందిన ఆయనను హత్య కేసులో ఇరికించడానికి ప్రభుత్వం కుట్ర పన్ను తోందన్నారు. వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావుకు అదే ప్రాంతానికి చెందిన సురేంద్రకు వర్గకక్షలున్నాయన్నారు. ఈ క్రమంలోనే భాస్కర్‌రావు హత్య జరిగిందని ఆ ప్రాంతవాసులు కోడైకూస్తున్నారన్నారు. కొల్లు రవీంద్రకు ఫోన్‌ చేశారనే నెపాన్ని అడ్డం పెట్టుకుని ఆయనపై రాజకీయంగా ప్రభు త్వం కక్ష తీర్చుకుంటోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ప్రోద్బలంతో బీసీ నాయకులను అణగదొక్కడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.  

Updated Date - 2020-07-06T10:50:35+05:30 IST